PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లూరమ్మ తల్లీ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లీ

1 min read

మల్లూరమ్మ తల్లి జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: మల్లూరమ్మ తల్లీ ప్రజలందరినీ చల్లంగా చూడుతల్లీ అంటూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు ప్రార్థించారు. చిన్నమండెం మండలం మల్లూరమ్మ జాతర సందర్భంగా బుధవారం వారు మల్లూరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రూ 1 కోటి నిధులుతో మల్లూరమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరలో మొదలు కానున్నాయన్నారు. మల్లూరమ్మ ఆలయ ఖ్యాతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
కొత్తపల్లె రామాలయ నిర్మాణ పనులు భేష్…మల్లూరు కొత్తపల్లె లో రూ 50 లక్షలుతో చేపట్టిన రామాలయం నిర్మాణ పనులు భేషుగ్గా ఉన్నాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డితో కలసి రామాలయ నిర్మాణ పనులను, రూ 44లక్షలుతో చేపట్టిన కళ్యాణ మండపం నిర్మాణ పనులు, ఫ్లోరింగ్, బాత్ రూమ్స్ నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పలు విందులకు హాజరు…
మల్లూరమ్మ జాతర సందర్భంగా చిన్నమండెం మండలంలో పలువురు నాయకులు ఇచ్చిన విందులకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు హాజరయ్యారు.
రాష్ట్ర తొగటవీర క్షత్రియ సంఘ అధ్యక్షుడు మోడెం వీరాంజనేయ ప్రసాద్, కొత్తపల్లె సర్పంచ్ భూంసాని లక్ష్మిరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు మిషన్ చంద్రారెడ్డి లు ఇచ్చిన విందులలో శ్రీకాంత్ రెడ్డి, దేవనాధ రెడ్డి లు హాజరయ్యారు.

About Author