NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోతిరాళ్లలో వ్యక్తి దారుణ హత్య!

1 min read

– గొంతు కోసి చంపిన దుండగులు
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ సర్కిల్ పరిధిలో కోతిరాళ్ల గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. కోతిరాళ్ల గ్రామానికి చెందిన గొల్ల మల్లికార్జున యాదవ్ (55)ను గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ పొలాల్లో గొంతు కోసి హత్య చేశారు. ఉదయం 10 గంటలకు వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులు హత్యా సంఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్​ఐ ఆదినారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. హత్యకు కారణాలు ఆస్తి తగాదాల.. లేక అక్రమ సంబంధమా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానస్పదంగా మృతి చెందిన మల్లికార్జున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

About Author