PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేంపల్లె పోలీసుస్టేషన్​ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: వేంపల్లె ఎస్​ఐ సుభాష్​ చంద్రబోస్​ వేదిస్తున్నాడంటూ రవికుమార్​ అనే వ్యక్తి శుక్రవారం పోలీసుస్టేషన్​ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు హుటాహుటిన వేంపల్లె వైద్యశాలకు తరలించారు. ఇటీవల రాజీవ్​నగర్​లో ఓ ఇంటిపై జరిగిన దాడి కేసులు రవికుమార్​ నిందితుడు. అయితే సదరు కేసుకు సంబంధించి పోలీసులు కోర్టు సమన్లు జారీ చేశారు. ఈక్రమంలో రవికుమార్​ పోలీసుస్టేషన్​కు వెళ్లి ఎస్​ఐ తనను వేదిస్తున్నాడంటూ సూపర్​వాస్మోల్​–33 సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో స్థానిక వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు ప్రధమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రెఫర్​ చేశారు. దీంతో కడప రిమ్స్​ వైద్యశాలకు తరలించారు. అయితే ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఎస్​ఐ ఎలాంటి వేదింపులు చేయలేదని స్పష్టం చేశారు.

About Author