PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దౌలాతాపురం ఎస్టీ కాలనీలో వ్యక్తి ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : మండలంలోని దౌలతాపురం ఎస్టీ కాలనీకి చెందిన ఇండ్ల వెంకటేష్, (25) అనే వ్యక్తి ఆరోగ్యం బాగ లేకపోవడంతో శుక్రవారం దౌలతా పురం లోని ఎస్టి కాలనీ సమీపంలోని కంపచెట్ల కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, నెల్లూరు జిల్లా ఉదయగిరి లోని సోమల రెడ్డి గూడ గ్రామానికి చెందిన ఇండ్ల వెంకటేష్ కు చెన్నూరు మండలం దౌలతాపురం గ్రామంలోని ఎస్టి రామాపురం కి చెందిన మల్లీశ్వరి, తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగి భార్యాభర్తలు ఇద్దరు అత్తగారి ఊరు దౌలాతాపురం ఎస్టి కాలనీ లో ఉంటూ కడపలోని ఒక కళ్యాణ మండపంలో భార్యాభర్తలిద్దరూ స్వీపర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు, అయితే మృతుడు ఇండ్ల వెంకటేష్ రెండు రోజుల నుండి ఆరోగ్యం బాగోలేదని గురువారం ఇంటి నుండి వెళ్లిపోయి ఎస్టి కాలనీ సమీపంలోని కంపచెట్లల్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు, కాగా కుటుంబ కలహాలతోనే మృతిచెందినట్లు తెలుస్తున్నదని, వారు తెలిపారు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

About Author