PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల బాట దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బైకు డీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందారు.బైరాపురం గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నందికొట్కూరు ఆర్టీసీ డిపో నుండి బస్సు నంద్యాలకు వెళుతూ ఉండగా సుంకేసుల బాట దగ్గర బస్సులో ఉన్న ప్రయాణికులు దిగుతుండగా బైరాపురం గ్రామానికి చెందిన బొంతల పెద్ద షుకూర్,కమాల్ బి కుమారుడు బొంతల మహబూబ్ బాషా (34) నందికొట్కూరు నుండి బైరాపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుంకేసుల బాట దగ్గర ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొట్టడంతో కిందపడిన తలకు బలమైన గాయం తగిలిందని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ లో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.మార్గ మధ్యలోనే మరణించాడని వైద్యులు దృవీకరించారు. మృతునికి భార్య రహమత్ భి,మన్సూర్(12), మహబూబ్ (10)సంతానం ఉన్నారు.కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.భార్య రహమత్ బి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.మారుతి శంకర్ తెలిపారు.

About Author