PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటుతో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, దేవనకొండ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు మంగలి బజారి (44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా… ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంగలి బజారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పాలకుర్తి గ్రామస్తులు కోరారు.

About Author