PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లారీ ఆటో ఢీ వ్యక్తి మృతి.. ఒకరికి గాయాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల పరిధిలోని బూజనూరు వై ఎన్ రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  కూరగాయల ఆటో రోడ్డుపై నిలబడి ఉన్న లారీని గుద్దడంతో  ఆటోలో ఉన్న (గడివేములకు) చెందిన  వ్యక్తి అబ్దుల్ రజాక్ అక్కడికక్కడే మృతి చెందాడు ఆటో నడుపుతున్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

About Author