PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లా నాయ‌క్ తో మంచు మ‌నోజ్ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పవన్ కల్యాణ్‌తో, మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ స్పాట్ లో వీరిద్దరి భేటీ జ‌రిగింది. స్వతహాగా పవన్ కల్యాణ్ అంటే.. మంచు మనోజ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మనోజ్ పట్ల, పవన్ కల్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది. ఇటీవ‌ల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మంచు మ‌నోజ్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంత‌రించుకుంది.

About Author