PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు మండల స్థాయి పోటీలు

1 min read

పల్లవెలుగు వెబ్ చెన్నూరు :  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రం నందు శనివారం వివిధ పాఠశాల విద్యార్థులకు ఆటలు పోటీలు, అలాగే హ్యాండ్ రైటింగ్ నందు పోటీలు నిర్వహించారు, ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా మండలంలోని రామనపల్లె జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలప్రధానోపాధ్యాయురాలు ఉమామహేశ్వరి, అలాగే చిన్నమాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివుడు వ్యవహరించడం జరిగింది, పోటీలలో జూనియర్ విభాగంలో కే సాయి దేవ, 7వ తరగతి, శ్రీ భారతి స్కూల్, సీనియర్ విభాగంలో కె శ్రీ బిందు శ్రీ భారతి పాఠశాల హ్యాండ్ రైటింగ్ నందు టి ప్రణతి ఆర్ఆర్ స్కూల్, టిపి సూర్య తేజస్విని శ్రీ భారతి, బి.సుస్మిత జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చెన్నూరు ఎంపిక కావడం జరిగింది అన్నారు, కాగా వీరు నేడు ఆదివారం 9 గంటలకు కడప కాగితాల పెంట నందుగల మండల విద్యాశాఖ కార్యాలయం నందు హాజరు అవుతారని రామనపల్లి ప్రధానోపాధ్యాయురాలు, ఉమా ఉమా మహేశ్వరి తెలిపారు.

About Author