NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఈ  రోజు హొళగుంద మండలంలో స్థానిక పార్టీ ఆఫీసులో మండల కన్వినర్ మరియు ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది . ఈ సమావేశంలో కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ వైసీపీ వాలంటీర్ వ్యవస్థకు దీటుగా కుటుంబ సారతులు వ్యవస్థ  ద్వారా టీడీపీ పార్టీ చేయబోయే  సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి తెలుపాలి అని ఉద్దేశంతో  30 ఇళ్లకు లేదా 100 ఓటర్లకు ఒకరు కుటుంబ సారథి నియమించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు అచెం నాయుడు ఆదేశాల మేరకు సమావేశాన్ని  ముందస్తుగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ సర్పంచులు,కోట్ల అభిమానులు, ఐటీడీపి -టి న్ స్ ఫ్ నాయకులు మరియు వివిధ హోదాలో ఉన్న టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author