PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల వ్యాప్తంగాజోరుగా ఎన్నికల ప్రచారం

1 min read

-ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నవైస్సార్సీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని,ప్రతి కుటుంభం లో మేలు జరిగివుంటేనే మళ్ళీ వైస్సార్సీపీ కి పట్టం కట్టాలని,వైస్సార్సీపీజిల్లా ఉపాధ్యక్షుడులు గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి, వైస్సార్సీపీ నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ అన్వర్ భాష,అన్నారు, ఆదివారం మండల వ్యాప్తంగా వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు,ఈసందర్భంగా చెన్నూరు 4వ,వార్డులో వారువైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తో కలసి ఇంటింటికి వెళ్లి ఆఇంటికి జరిగిన మేలును వచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైస్సార్సీపీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు, ఈసారి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే 40ఏండ్లుమళ్ళీజగన్మోహన్రెడ్డిముఖ్యమంత్రిగాఉంటారనితెలిపారు,అలాగే ఎంఎల్ఏ రవీంద్ర నాద రెడ్డి కమలాపురంనియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పధంలో నడిపి అందరికి అందుబాటులో ఉంటు యేసమస్య ఉన్న ఆయన దృష్టికి తీసుకెళితే ఆయన వెంటనే స్పందించి ఆయా పనులను త్వరగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఆయనను మండల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు, కుల మతాలకు అతీతంగా పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్,ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు రవి రెడ్డి,వారీష్, హస్రత్,అబ్దుల్ రబ్, కరీం, జుమన్ ,గుమ్మల మధుసూదన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచులు సిద్దిగారి వెంకటసుబ్బయ్య, తుంగ చంద్రశేఖర్ యాధవ్, నీలం శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ పిచ్చయ్య, టి ఎన్ చంద్ర రెడ్డి, శాస్త్రి, ఎంపీటీసీలు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, రఘురాం రెడ్డి, మాజీ ఎంపీటీసీలు , సాధక్ అలీ, జుమన్, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author