PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  అక్రమ కేసు నిరసిస్తూ ప్రెస్ మీట్

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన  రాయిచోటిలో ఎస్.ఎన్ కాలనీలోని స్థానిక మండిపల్లి భవన్ లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  అక్రమ కేసులను నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు,మండిపల్లి అభిమానులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంప్రసాద్ రెడ్డి  ఈ అక్రమ కేసులకు భయపడే నాయకుడు కాదు అన్నారు. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. ఇది విజయం మాదే అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మండిపల్లి అభిమానులు టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author