PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్న నాగిరెడ్డికి నివాళులు అర్పించిన మాండ్ర,గౌరు..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు జనార్దన్ రెడ్డి తండ్రి జూపల్లె.చిన్న నాగిరెడ్డి(77) మంగళవారం ఉదయం 11 గంటలకు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.మరణ వార్తను తెలుసుకున్న టిడిపి అగ్ర నేతలు సాయంత్రం నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు మురళీధర్ రెడ్డి,మాండ్ర ఉమాదేవి,మాండ్ర సురేంద్ర నాథ రెడ్డి,మిడుతూరు మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గిత్త జయసూర్య గ్రామానికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని వారు అన్నారు.కుటుంబ సభ్యులకు వారు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో సుభాన్ గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి,ఇద్రీస్,రఫిక్ ఖలీల్  బేగ్ తదితరులు పాల్గొన్నారు.

About Author