PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాండ్ర

1 min read

– త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మృతి చెందిన కుటుంబ సభ్యులకు టిడిపి పార్టీ అండగా ఉంటుందని నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినందున నాగలూటి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు చిన్న మాసుం సాహెబ్ ఇంట్లో టీవీ చూస్తుండగా ఈనెల 10వ తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.మంగళవారం సాయంత్రం 6:30 ని.కు  మాండ్ర శివానందరెడ్డి,టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,నందికొట్కూరు మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి గ్రామానికి వెళ్లి చిన్న మామాసుం సాహెబ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ పార్టీకి ఆయన చేసిన సేవలు మరచి పోలేనివని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని శివానందరెడ్డి మృతుని కుమారుడు బాబు సా మరియు కుటుంబ సభ్యులతో అన్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతోనే 36వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును అనవసరంగా చేయను తప్పుకు కేసు నమోదు చేసి జైలుకు పంపడం వీటన్నిటిని రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఇంకా అభిమానం ప్రజల్లో విపరీతంగా ఉప్పొంగుతోందని త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారని మాండ్ర శివానందరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు సంపంగి రవీంద్రబాబు, రమణారెడ్డి, వెంకటరెడ్డి,మాజీ సర్పంచ్ ఎల్ల నాగిరెడ్డి,రామ లింగేశ్వర రెడ్డి,సాంబ శివారెడ్డి, బాబు సా,టిడిపి మండల యువ నాయకులు సుభాన్,అల్లూరు సురేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author