NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ నేత

1 min read

పల్లెవెలుగువెబ్ : మంగళగిరి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అనుచరుడు గొర్లె వేణుగోపాల్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆయన వెంట పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. లోకేశ్ ఇక్కడి టీడీపీ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు

About Author