NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్మీ చీఫ్ గా మ‌నోజ్ పాండే పేరు ఖ‌రారు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఇంజనీర్స్ కార్ప్స్‌ నుంచి ఆర్మీ చీఫ్‌గా నియమితులవుతున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 29వ ఆర్మీ చీఫ్‌గా ఆయన ఈనెలాఖరులో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాండే కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.

                                       

About Author