PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గా రాఘవేంద్ర రెడ్డి

1 min read

ఇంచార్జ్ ప్రకటన పై  బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

 మంత్రాలయం, పల్లెవెలుగు:  కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గా మాధవరం రాఘవేంద్ర రెడ్డి  ని అధిష్టానం ప్రకటించడంతో మంత్రాలయం లో రాఘవేంద్ర సర్కిల్ లో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణా సంచా పేల్చి స్వీట్స్  ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా టిడిపి నాయకులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాఘవేంద్రస్వామి అనుగ్రహంతో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రాఘవేంద్ర రెడ్డిని మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీగా ప్రకటించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బి వరదరాజు లు, ఎంపిటిసి నక్కి వెంకటేష్, నాయకులు మేకల నరసింహ, శివ, డేవిడ్, రాజు, కలుదేవకుంట రాఘన్న, పేతురు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఛైర్మెన్ నరసింహులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాధవరం లో..:  స్థానిక నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి గా టిడిపి అధిష్టానం ప్రకటించడంతో టిడిపి నాయకులు ఆలం భాష, విజయ్ కుమార్, బారికి ఉరుకుందు, మహబూబ్ బాషా, అరుణ్ బాష, బూదిరెడ్డి, హుస్సేన్ ఆలం, బోయ నాగరాజు, భీమారెడ్డి, తోటయ్య లు సర్కిల్ లో బాణాసంచా కాల్చి, మిఠాయి లు ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.

About Author