NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం ఎంఈఓ పై విచారణ చేశారు కానీ చర్యలు ఎక్కడ?

1 min read

ఆర్ యు ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం:   మంత్రాలయం యం ఈ ఓ మొయినుద్దీన్ పై విచారణ చేపట్టి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  ఆర్ యు ఎస్ ఎఫ్,  జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది లు అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ   ఎంఈఓ మొయిద్దీన్ అవినీతి పై విచారణలో డిప్యూటీ డిఇఓ ఆధ్వర్యంలో విచారణ జరపగా ఈ విచారణలో ఎంఈఓ మొయినుద్దీన్ అవినీతికి పాల్పడినట్లు స్పష్టంగా తెలిసిన కూడా ఉన్నత విద్యాధికారులు ఎంఈఓ మొహినిద్దీన్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం తగదన్నారు. దీనిపై ఉన్నత విద్యాధికారులు చొరవ తీసుకొని అవినీతి చక్రవర్తి అయినా ఎంఈఓ మోహిద్దిన్ ను సస్పెండ్ చేయాలని  అలాగే దోచుకున్న సొమ్ము అంతా తిరిగి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి టీచర్లను వేధించడం మానుకోవాలన్నారు.లేని పక్షంలో డిఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  చిన్న, వీరేష్,  ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

About Author