NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గుమ్మనూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలం, దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం  స్వామి వారిని దర్శనము చేసుకున్నారు.అనంతరము మంత్రి  మాట్లాడుతూ ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి బన్ని ఉత్సవం  జరుగుతుంది.అలాగే కర్రల యుద్ధం అని కొందరు అంటున్నారు.ఇది కర్రల సమరం కాదు.సంప్రదాయం ప్రకారం బన్నీ ఉత్సవం జరుగుతుంది అని తెలిపారు.పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి,మంత్రి  అధికారులకు,పలు సూచనలు చేశారు.ఈ సంవత్సరం బన్నీ ఉత్సవం భక్తదులు అన్ని ఏర్పాట్లు చేశాము అని మంత్రి  తెలిపారు ఆలయ లో ఏర్పాట్లు అన్ని బాగున్నాయి అని మంత్రిచ తెలిపారు. ఈ కార్యక్రమంలో  సోదరులు,ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు గుమ్మనూరు నారాయణ స్వామి ,ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ,జడ్పీటీసీ ఏరూరు శేఖర్,నేరిణినికి,తండా,కొత్తపేట, గ్రామాల నాయకులు ప్రజలు, నియోజకవర్గ పరిధిలోని వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…!

About Author