PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మావోయిస్టు అగ్రనేత ఆర్​కే ఇకలేరు! ధృవీకరించిన మావోయిస్టుపార్టీ

1 min read

పల్లెవెలుగువెబ్​, చత్తీష్​గడ్​: మావోయిస్టు అగ్రనేత ఆర్​కే(రామకృష్ణ)మృతిచెందారన్న..విషయాన్ని మావోయిస్టుపార్టీ శుక్రవారం ధృవీకరించింది. చత్తష్​గడ్​ అడవుల్లోని బస్తర్​ గ్రామంలో 14న మావోయిస్టు నేత రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఆర్​కే మృతిని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్​ ధృవీకరిస్తూ లేఖ విడుదల చేశారు. గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న ఆర్​కే సరైన వైద్యం అందక మృతిచెందినట్లుగా పేర్కొన్నారు. 1958లో గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించిన ఆర్​కే 25ఏళ్ల వయసులో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడై 1982లో పీపుల్స్​వార్​ పార్టీలో చేరాడు. నల్లమల అరణ్యంలో నక్సల్​ ఉద్యమం విస్తరణక కృషి చేశారు. అప్పట్లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేసి 1992లో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2001లో ఏవోబీ కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రకమిటీ స్థాయికి ఎదిగాడు. 2004లో అప్పటి వైఎస్​ఆర్​ ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో నక్సల్స్​ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే చర్చల విఫలంలో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో 2018లోకేంద్ర కమిటీ పొలిట్​బ్యూరోలో ఆర్​కే స్థానం దక్కించుకున్నారు. 40ఏళ్ల ఉద్యమ బాటలో అనేక మార్లు పోలీసు ఎన్​కౌంటర్ల నుంచి ఆర్​కే తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు ఉద్యమబాటలో సదీర్ఘంగా పోరాడుతోన్న ఆర్​కే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా 63ఏళ్లకు కిడ్నీసమస్యతో తనువుచాలించడం విషాదకరం.

About Author