PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: మండలంలోని నర్సారెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉండే మహాలక్ష్మి అనే వివాహిత తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్​ఐ బి. శ్రీనివాస రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నరసారెడ్డి పల్లె గ్రామానికి చెందిన మహేంద్ర రెడ్డితో రాజుపాలెం మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అత్తమామల వేధింపులా… లేదా భర్త సతాయింపులో తెలియదు కానీ… ఆదివారం మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చిన ఆమె భర్త మహేంద్ర రెడ్డి ఇరుగుపొరుగు వారికి తెలపగా… అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి తల్లిదండ్రులు తమ కూతురు చావుకు అత్త లక్ష్మమ్మ, భర్త మహేంద్ర రెడ్డి కారణమని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ విషయమై కడప డిఎస్పి సునీల్, సిఐ విచారించి తాసిల్దారు తో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

About Author