PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవనూరులో వివాహిత ఆత్మహత్య..

1 min read

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో దండుగుల రాజేశ్వరి (25)వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎం.జగన్ మోహన్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు జూపాడు బంగ్లా మండలం 80 బన్నూరు గ్రామానికి చెందిన ఓర్సు నాగేంద్రమ్మ కూతురు రాజేశ్వరిని గత ఏడు సంవత్సరాల క్రితం దేవనూరు గ్రామానికి చెందిన దండుగుల మధు శేఖర్ తో వివాహం జరిగింది.భర్త మధు శేఖర్, మామ తిమ్మన్న ప్రతిరోజు వేధింపులకు గురి చేసేవారు.వేధింపులను తట్టుకోలేక గురువారం ఉదయం తెల్లవారు జామున 4:50 ని.కు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.అదేవిధంగా మృతురాలికి ఒక కుమారుడు తేజ(1),కూతురు-(4) ఉన్నారు.మృతురాలి తల్లి ఓర్సు నాగేంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త మామపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ మోహన్  తెలిపారు.

About Author