PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాస్కే.. రక్షణ కవచం

1 min read

– బుట్టా ఫౌండేషన్​ మేనేజర్​ రాజేష్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కోవిడ్​ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతిఒక్కరూ నాణ్యమైన మాస్క్​లు ధరించాలని బుట్టా ఫౌండేషన్​ మేనేజర్​ రాజేష్​ సూచించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు.. గురువారం బుట్టా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నాణ్యమైన క్లాత్​ మాస్కులు విడుదల చేశారు. ఈ సందర్బంగా బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఒంటికి దుస్తులు, కాళ్లకు చెప్పులు ఎలాగో.. ముఖానికి మాస్కులు కూడా అత్యవసరమయ్యాయన్నారు. బహిరంగ ప్రదేశాలలో చిరువ్యాపారులు, మార్కెట్లలో రైతులు, బ్యాంకులు, వివిధ పనుల నిమిత్తం తిరిగే ప్రజలు వాడే మాస్క్​లు నాణ్యతగా లేవని, దీంతో కరోన వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉందన్నారు. రైతులు, చిరువ్యాపారులను దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ బుట్టా రేణుక నాణ్యమైన మాస్క్​లు అందజేయాలని ఆదేశించడంతో… వారికి మాస్క్​లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గట్టుపల్లి సురేందర్, కుర్ని నగర అధ్యక్షులు గణప చేనప్ప , బుట్టా ఫౌండేషన్ కోఆర్డినేటర్ హేమలత , వాలంటీర్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author