NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో దారుణ హత్య

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో దారుణ హత్య జరిగింది. గాండ్ల కిట్టు అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కిరాతకంగా హత్య చేశారు. బహిర్భూమికి వెళ్తున్న కిట్టుపై కత్తులు, ఇనుపరాడ్లతో ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిట్టు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొలం తగాదా విషయంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

           

About Author