PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

22 మంది క‌మాండోల ఊచ‌కోత !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్ఘాన్ లోని ఫ‌ర్యాబ్ ప్రావిన్సులో గ‌ల ద‌వ్లాత్ అబ‌ద్ ప‌ట్టణంలో 22 మంది ఆఫ్ఘాన్ క‌మాండోల‌ను తాలిబ‌న్లు ఊచ‌కోత కోశారు. సైనికులు శాంతియుతంగా లొంగిపోయిన‌ప్పటికీ తాలిబ‌న్లు ఈ ఘాతుకానికి తెగ‌బ‌డ్డారు. సీఎన్ఎన్ కు దొరికిన వీడియో ప్రకారం లొంగిపొమ్మని సైనికుల్ని కోర‌డంతో.. ఒక భ‌వ‌నం నుంచి నిరాయుధులుగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరిని విచ‌క్షణార‌హితంగా తాలిబ‌న్లు చంపారు. గ‌త‌నెల 16న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు సీఎన్ఎన్ చెబుతోంది. 22 మృత‌దేహాలు స్వాధీనం చేసుకున్నట్టు రెడ్ క్రాస్ చెబుతోంది.

About Author