PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీగా చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో వైసీపీ నుంచి టీడీపీలో కి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్న నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నందికొట్కూరు పట్టణంలో 26వ వార్డు వైసీపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి అతని అనుచరులు వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం  నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి.టీడీపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ వైసిపి అరాచక పాలన నచ్చక వారంతా తమ పార్టీలో చేరారన్నారు.  నియోజకవర్గంలో తమ పార్టీకి రోజురోజుకు బలం పెరుగుతోందని అన్నారు. మున్ముందు  టిడిపిలోకి భారీగా వలసలు ఉంటాయని అన్నారు. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన నేతలు  భరత్ రెడ్డి,  హుస్సేన్, చంద్ర, మజీద్, మా భాష, సోడా ముత్తు,  రాఘవ, రవి, అనురాధ,శైలజ, సలీమా, మాట్లాడుతూ మాండ్ర నాయకత్వంలో పనిచేసేందుకు తామంతా ఉత్సాహంగా ఉన్నామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్  ఖాతా రమేష్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  జయసూర్య,ఐ టీడీపీ ఇంచార్జి  ముత్తు జావలి,మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకిల్ అహ్మద్,   లాయర్ జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, బి జనార్ధన్, ఎస్ఎండి  జమీల్, రసూల్ ఖాన్,నిమ్మకాయల మోహన్,రాజు, బొల్లెద్దుల రాజన్న, కళాకారు, ప్రవీణ్ రగడ, మద్దిలేటి, ప్రభు కుమార్, సురేషు, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author