NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీగా పెరుగుతున్న క‌రోన కేసులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ వ్యాప్తంగా క‌రోన కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తాజాగా 94 పెరిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1525కు చేరాయి. 560 మంది ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌ట్టు వైద్యారోగ్య వ‌ర్గాలు చెబుతున్నాయి. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో 21శాతం పెరుగుదల కనిపిస్తుంది. ఇక ఒక్క రోజే 284 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కి చేరింది. ఇప్పటి వరకు 4,81,770 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,22,801 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

                                      

About Author