PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప్ప‌ల్ లో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇండియా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. నేటి మ్యాచ్ లో నెగ్గిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ మైదానంలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, హైదరాబాదులో ప్రేక్షకుల నడుమ ఆడనుండడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపాడు. నాగ్ పూర్ లో విజయవంతమైన లక్ష్యఛేదన జట్టులో ఉత్తేజాన్ని నింపిందని, ఇక్కడా అదే ఒరవడి కొనసాగిస్తామని చెప్పాడు. గత మ్యాచ్ లో ఆడని భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులోకి వచ్చాడని, రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని రోహిత్ శర్మ వెల్లడించాడు.

                                            

About Author