PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్లా దీవెనలు కర్నూలు ప్రజలపై ఉండాలి.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అల్లా దీవెనలు కర్నూలు ప్రజలపై ఉండాలని తాను ప్రార్థించినట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని నరసింహరెడ్డి నగర్లో ఉన్న ఆమీరుద్దీన్ మసీదులో ఆయన రంజాన్ ప్రార్థనలు చేసేందుకు వచ్చారు. ముందుగా రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ ఆమీరుద్దీన్ మసీదు నిర్వహణ చాలా బాగుందని నిర్వాహకులను అభినందించారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అల్లా కాపాడాలని అందరం కోరుకోవాలన్నారు. ఇక టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మసీదు అభివృద్ధికి నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. తమ టీజీవి సంస్థల తరపున కూడా కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలు మంచి చేసే వారిని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రసూల్ ఖాన్, ఇమ్రాన్, ఆబీద్, టిడిపి బిసి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author