PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి నీ గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం పశ్చిమ రాయలసీమ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి నీ గెలిపించాలని కోరుతూ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి ఆదేశాల మేరకు కర్నూల్ నగరంలోని ఇల్లూరు నగర్ సీతారాం నగర్ సెంటర్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఏసన్న 43 వార్డు రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా సాంస్కృతిక వి భాగం అధ్యక్షులు హనుమంతరావు చౌదరి నాగేశ్వరావు చౌదరి ప్రభాకర్ రావు ఈశ్వరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకు చదువుకు తగ్గ ఉద్యోగం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఉన్నత చదువులు చదివిన వారికి వాలంటరీ ఉద్యోగాలతో అరకొరగా జీతాలు ఇచ్చి వాళ్ళు వేరే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూసుకోకుండా చేతులు కట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మరి కొంతమంది యువకులు బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని బాధ వ్యక్తం చేశారు ఎన్నికల సమీపిస్తున్న వేళ పెట్టుబడులను రప్పించి లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు నిరాశలో ఉన్న నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు ఎమ్మెల్సీగా భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించి ఈ ప్రభుత్వానికి చెప్పాలని ఓటర్లను కోరారు.

About Author