PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త సంవ‌త్సరంలో క‌ర్నూలు ప్రజ‌లు సుఖ‌సంతోషాల‌తో ఉండాలి..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌

టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో ఘ‌నంగా నూత‌న సంవ‌త్సర వేడుక‌లు

టిడిపిలో చేరిన 49వ వార్డు యువకులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  2024 నూత‌న సంవ‌త్సరంలో క‌ర్నూలు ప్రజ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నట్లు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్సరం వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. క‌ర్నూలులోని అన్ని వార్డుల నుండి నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి టి.జి భ‌ర‌త్‌కు నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు. జ‌న‌సేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జి అర్షద్‌, నేత‌లు టి.జి భ‌రత్‌ను క‌లిశారు. వివిధ‌ కుల సంఘాలు, పార్టీ అనుబంధ సంఘాల నాయ‌కులు ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నూత‌న సంవ‌త్సర క్యాలెండ‌ర్‌ను టి.జి భ‌ర‌త్ అంద‌రికీ అంద‌జేశారు. అనంత‌రం న‌గ‌రంలోని 49వ వార్డులోని ప్రకాశ్ న‌గ‌ర్‌, ఎన్‌.ఆర్ పేట ప్రాంతాల‌కు చెందిన యువ‌కులు టిడిపి నేత‌ విక్రమ్ సింగ్ ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సాయి కుమార్, వినోద్, అబ్దుల్లా, యుగెంద‌ర్, మోహ‌న్‌, ర‌సూల్‌, సాదిక్‌, అరున్, త‌దిత‌రులు ఉన్నారు.

About Author