PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి మాయావ‌తి దూరం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోర‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.సి. మిశ్రా తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు. అయితే.. అసెంబ్లీ ఎన్నిక‌లకు మాయ‌వ‌తి దూరం కావ‌డం ప‌ట్ల బీఎస్పీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మాయావ‌తి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల గెలుపు పై కూడ ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు. మాయ‌వ‌తి నిర్ణ‌యం ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

                                        

About Author