PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంబీఏ, ఎంసీఏ సీట్లు.. స‌గ‌మే భ‌ర్తీ అయ్యాయి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల‌కు సంబంధించి క‌ళాశాల‌ల్లో మొద‌టి విడ‌త కౌన్సిలింగ్ జ‌రుగుతోంది. రెండోవిడ‌త కౌన్సిలింగ్ త్వ‌ర‌లో జ‌రుగుతుంది. అయితే మొద‌టి విడ‌త‌లో కేవ‌లం స‌గం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి. ఏపీ ఐసెట్‌ -2021మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో భర్తీ అయిన సీట్ల వివరాలను ఐసెట్‌ కన్వినర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 36,263 సీట్లు అందుబాటులో ఉండగా 15071 మంది అభ్యర్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏకి కలిపి 13930 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారని, 12612 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 1318 మందికి సీట్లు కేటాయించలేదన్నారు. 27 ఎంబీఏ కళాశాలల్లో, 56 ఎంసీఏ కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ కాగా, 26 ఎంబీఏ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదన్నారు.

                                

About Author