PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాంసం అప‌విత్రం కాదు.. ఆహారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నవరాత్రుల రోజుల్లో దక్షిణ ఢిల్లీలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. మాంసం అపవిత్రమైనదేమీ కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని, వద్దనుకుంటే కొనుగోలు చేయకపోతే సరిపోతుందని ఓ ట్వీట్‌లో ఒవైసీ అన్నారు.

                                         

About Author