PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు..ప్రభుత్వానికి వారధి..‘మీడియా’

1 min read

ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​

  •  ‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరించిన వైద్యులు డా. చంద్రశేఖర్​, డా. హేమంత్​ కుమార్​

కర్నూలు, పల్లెవెలుగు:ప్రస్తుత సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ… అవినీతిని ఎండగట్టే మీడియా రంగం.. మరింత రాణించాలని పిలుపునిచ్చారు ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్ ​. సోమవారం కర్నూలు హార్ట్​ అండ్​ బ్రెయిన్​ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘పల్లెవెలుగు దినపత్రికకు సంబంధించి నూతన క్యాలెండర్​ను డా. చంద్రశేఖర్​తోపాటు న్యూరాలజిస్ట్​ డా. హేమంత్​ కుమార్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ మీడియా రంగం ప్రజలకు..ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని సూచించారు. ప్రపంచంలో జరిగే ఏ ఘటన అయినా క్షణాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా రంగం… ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలు.. భవిష్యత్​లోనూ అదే ఒరవడిని కొనసాగించాలని కోరారు. పల్లెవెలుగు దినపత్రిక.. వెబ్​ మీడియాలోనూ అడుగు పెట్టడం శుభ పరిణామమని,  పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​  ఆకాంక్షించారు. క్యాలెండర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

About Author