PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీడియా రంగం.. కీలకం…

1 min read

సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. వసంత కుమార్​

  • ‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ను ఆవిష్కరించిన వైద్యులు

కర్నూలు, పల్లెవెలుగు:ప్రస్తుత సమాజంలో మీడియా రంగం కీలకంగా మారిందన్నారు శ్రీ విజయ దుర్గా ఆస్పత్రి ఎండి, సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. వసంత కుమార్​. శుక్రవారం గాయత్రి ఎస్టేట్​లోని శ్రీ విజయ దుర్గా ఆస్పత్రిలోని ఆయన ఛాంబరులో ‘పల్లెవెలుగు’ దినపత్రిక క్యాలెండర్​ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డా. వసంత కుమార్​ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మీడియా రంగం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవాలని సూచించారు. నిజాలు నిర్భయంగా రాసే మీడియాను ఎప్పుడూ ప్రజలలో  ఆదరణ ఉంటుందన్నారు.  నగరంలో గాయత్రి ఎస్టేట్​లో కొన్నేళ్లుగా శ్రీ విజయ దుర్గా కార్డియక్​ సెంటర్​లో తక్కువ వ్యయంతో ఎంతో మందికి గుండె సమస్యలకు సంబంధించి ఆపరేషన్లు చేశామన్నారు. ఎందరికో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అనాథలకు, వృద్ధులకు ఉచిత చికిత్సలు అందజేశామన్నారు. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలులోనే ఆధునిక టెక్నాలజీతో గుండెకు సంబంధించి శస్ర్తచికిత్సలు చేస్తున్నామని, హైదరాబాద్​, బెంగుళూరు తదతర దూరపు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబీకులకు తక్కువ వ్యయంతోనే శస్ర్తచికిత్సలు చేస్తామని ఈ సందర్భంగా సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. వసంత కుమార్​ వెల్లడించారు.

About Author