PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయినాధుడి సహాయంతో గిరిజనుడి కి వైద్య సహాయం

1 min read

-గిరిజనుడి కష్టం తొలగించిన సాయినాథ్ శర్మ

-ప్రశంసిస్తున్న దౌలతాపురం జనం

పల్లెవెలుగు వెబ్ కడప: ఆ గిరిజనుడి కి ఒకవైపు తీవ్రమైన ఆర్థిక కష్టాలు, మరోవైపు ఆరోగ్య సమస్యలు కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా చిల్లి గవ్వ లేని అత్యంత నిరుపేద గిరిజన కుటుంబం పడుతున్న ఇబ్బందులను నియోజకవర్గ నిరుపేదల మనిషిగా గుర్తింపు పొందిన సాయినాథ్ శర్మ, (యా కసిరి చంద్రయ్య) బాధితుని సమస్య విని చెల్లించిపోయి ఆ గిరిజన కుటుంబానికీ పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం తో పాటు, కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబానికి చేయూత గా అతనిని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వైద్య సేవ నిమిత్తం పంపించడం జరిగింది, ప్రజా నాయకుడిగా మానవతావాదిగా మానవత హృదయం కలిగిన. సమాజ సేవకుడిగా నిరంతరం పేద ప్రజల కన్నీళ్లను తొలగించే ఆపద్బాంధవుడిగా పేదల మనిషిగా కమలాపురం నియోజకవర్గంలో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ప్రజా సమస్యల పట్ల వారితో మమేకమవుతున్న తీరు నిరుపేదల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది. కమలాపురం నియోజకవర్గం లోని చెన్నూరు మండలం దౌలతాపూరం యానాది కాలనీల కి చెందిన యాకసిరి చంద్రయ్య అనారోగ్యం కారణంగా సోమవారం దౌలాతాపురం గ్రామంలో స్పృహ తప్పి పడిపోగా అతనిని సాయినాథ శర్మ అభిమానులు పరామర్శించి, వారికి సాయినాథ శర్మ చారిటబుల్ ట్రస్ట్ అయిన పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు, అతనిని కడపలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య సహాయం నిమిత్తం తరలించడం జరిగింది, అత్యంత నిరుపేద వ్యక్తి కావడం, వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో దౌలతా పురం లో స్థానికంగా ఉన్న సాయినాథ్ శర్మ అభిమానులు జనార్దన్ రెడ్డి, సుబ్బారెడ్డి మరికొందరు కలిసి ఈ విషయాన్ని తమ నాయకుడు సాయినాథ్ శర్మ దృష్టికి తీసుకురావడంతో వెంటనే మానవతా దృక్పథంతో సాయినాథ్ శర్మ వైద్య ఖర్చుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అప్పటికప్పుడు తన అభిమానులకు పంపించి చంద్రయ్య కుటుంబానికి అందించాల్సిందిగా కోరారు ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగించుకోవాలని, ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చిన ఎడల పూర్తిగా అతనికి వైద్య సహాయం కొరకు సాయినాథ్ శర్మ సహాయం అందించడం జరుగుతుందని ఆయన అభిమానులు పేర్కొన్నారు, ఆయన మానవతా సేవలకు నిదర్శనమని దౌలతాపురం గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని చంద్రయ్య కుటుంబం వైద్య ఖర్చులకు కూడా స్తోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితుల్లో సాయినాథ్ శర్మ పెద్ద మనసుతో వారి కుటుంబాన్నీ ఆదుకోవడం కోసం తక్షణ సహాయం కింద పది వేల రూపాయలు పంపించడంతో అక్కడి గిరిజనులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, తమ గ్రామం నుంచి సాయినాథ్ శర్మకు తాము ఇంతవరకు ఎటువంటి సహాయం చేయకపోయినప్పటికీ తమ గ్రామం మీద ప్రేమతో ఏ చిన్న ఇబ్బంది కలిగిన పెద్ద మనసుతో గ్రామస్తులను ఎంతగానో ఆదరిస్తున్న సాయినాధ శర్మ మానవతా హృదయం కలిగిన మంచి మనిషి అని బాధిత కుటుంబంతో పాటు యానాది కాలనీలోని గిరిజనులంతా సాయినాథ శర్మ సేవను విశేషంగా ప్రశంసిస్తున్నారు, ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి తో పాటు, పదవ వార్డ్ మెంబర్ కిట్టయ్య, కొండారెడ్డి, సుబ్బారెడ్డి, అంకయ్య, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

About Author