PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది కస్తూర్బా పాఠశాలలో వైద్యశిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది మండలం తిమ్మాపురం కస్తూర్బా పాఠశాలలో తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు పలు సూచనలు చేసి కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సూచనలిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థినులకు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తో పాటు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

About Author