PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిమ్స్​ ఆధ్వర్యంలో.. ఉచిత వైద్యశిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 176 జయంతి పురస్కరించుకుని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవ సమితి కిమ్స్ హాస్పిటల్ కర్నూలు సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, గైనకలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఎమెర్జెన్సీ మెడిసిన్ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలన్నారు. నిత్యం వ్యాయమం చేయాలన్నారు. అవసరమైన వారికి మందులు వాడాలని సూచించారు

About Author