NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుభరోసా కేంద్రాలలో రైతులతో సమావేశం

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని మాసపేట, కడుమూరు గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను జిల్లా వనరుల కేంద్రం నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు కె.జయదేవ్(డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్)మరియు కే. మంజువాణి(ఏడిఏ),కే.ఉమా మహేశ్వరి (బిటి ఎం)సందర్శించి రైతులతో వారు సమావేశం నిర్వహించారు.పంట పొలాలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేయడం జరిగినది.రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించి సేంద్రియ వ్యసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు.ఆర్బికెలలో రిజిస్టర్లు తనిఖీ చేసి విఏఏలకు తగు సూచనలు చేసారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ హుస్సేన్ బాషా,బి.శృతి,రైతులు,వాలంటీర్లు కే.భవాని,సోమన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author