PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా ఉచిత వైద్య శిబిరం

1 min read

– భారీగా తరలివచ్చిన ప్రజలు-165మందికి పైగా వైద్య పరీక్షలు
పల్లెవెలుగు వెబ్​ చెన్నూరు: మండలంలోని ఓబులంపల్లె గ్రామ పంచాయతీలో లక్ష్మీ నారాయణ ఆస్పత్రి ముండ్ల లక్ష్మీ శేఖర్ డాక్టర్ కార్తిక్ అందేలా వారినేతృత్వంలో ముండ్ల శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది చే ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్నినిర్వహించారు, ఈ ఉచిత వైద్య మెగా శిబిరానికి ఓబులంపల్లె పంచాయతీ నుండి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు, ఈ వైద్య శిబిరంలో గుండెకు సంబంధించి, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులకు, చర్మవ్యాధులకు, పంటి కి సంబంధించిన వ్యాధులకు దాదాపు165 మందికి పైగా వైద్యులు, వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రజలకు తమ అమూల్యమైన టువంటి వైద్య సేవలు అందించి ప్రజల కు మెరుగైన చికిత్సలు అందించడం పట్ల లక్ష్మి నారాయణ ఆస్పత్రి వారి కి గ్రామం తరపున ప్రజలు అభినందనలు తెలియజేశారు, అదేవిధంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైనవారికి మందులు పంపిణీ చేయడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author