PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు మెగా జాబ్ మేళ- నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

1 min read

– ఎంపీపీ  చీర్ల సురేష్ యాదవ్ 

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, గురువారం ఆయన చెన్నూరులోని ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కమలాపురంలోని సి ఎస్ ఎస్ & ఎస్ ఆర్ ఆర్ ఎం డిగ్రీ కళాశాలలో ఈనెల నాలుగవ తేదీ సమయం 9 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ &ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్,( ఏపీ ఎస్ ఎస్ డిసి, ఎస్ ఈ ఈ డి ఏ పి ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్) ఆధ్వర్యంలోనిర్వహించబడతాయని ఆయన తెలిపారు, వివిధ కంపెనీలు వచ్చే ఈ కార్యక్రమానికి, అర్హతలు పదవ తరగతి, ఇంటర్ ,ఐటిఐ, ఏదైనా డిగ్రీ, డిప్లమో, బీటెక్ చదివిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు, ఇంటర్వ్యూలకు హాజరై అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీలు రఘురామిరెడ్డి, నాగిరెడ్డి, సాదక్ అలీ, మండల కో ఆప్షన్ మెంబర్ వారిష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author