PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం వెంకయ్యనాయుడు

1 min read


పల్లెవెలుగు వెబ్: తెలుగుద‌నానికి నిలువెత్తు నిదర్శనం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగువారంతా మ‌రింత గ‌ర్వపడేలా ఆయ‌న రాష్ట్రపతి అవ్వాల‌ని చిరంజీవి ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ద్వారా తెలుగువారికి గుర్తింపు వ‌చ్చింద‌ని, ఇప్పుడు వెంకయ్యనాయుడు తెలుగుద‌నానికి నిలువెత్తు నిద‌ర్శనంగా నిలిచార‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌ను రాష్ట్రపతిగా చూడాల‌నుకుంటున్నాన‌ని.. ఇది తెలుగు వారంద‌రీ కోరిక‌ని మెగాస్టార్ అన్నారు. హైద‌రాబాద్‌లో యోధ లైఫ్ లైన్ డ‌యాగ్నోస్టిక్స్ సెంట‌ర్ ప్రారంభోత్సవ వేడుకలో ఉప‌రాష్ట్రపతి వెంక‌య్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

About Author