PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ్ఞాప‌క‌శ‌క్తి ఇలా పెంచుకోవ‌చ్చ‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్‌ డిసీజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఏరోబిక్స్‌తో పెరిగే రక్తప్రసారం వల్ల వృద్ధుల్లో తలెత్తే మతిమరుపు సమస్యలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఆధారంగా మెదడులో జ్ఞాపకశక్తితో సంబంధం ఉన్న ప్రదేశాలకు రక్తప్రసారాన్ని మెరుగుపరిచే మందులు కనుగొనడం ద్వారా, అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స అందించే వెసులుబాటు కలిగిందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్ కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

                                 

About Author