PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్లమెంట్​లో ‘కురువల’ ప్రస్థావన.. అభినందనీయం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: పార్లమెంట్లో కురువల గురించి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్థావించడం అభినందనీయమన్నారు కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి.  కురువలను మదాసి మదారి కురువలకు సరైన నిర్వచనం చెప్పండని పార్లమెంటులో ప్రస్తావించిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు… అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు కర్నూలు జిల్లా కురువ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మన్నారు.  కురువ కులస్థులు తమ సమస్యలు ఎదుర్కొంటున్నారని, మదారి మదాసి కురువ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న  సీఎం వైఎస్​ జగన్మోహన్ రెడ్డికి,  ఎంపీ లకు మా కులస్థులు రుణ పడి ఉంటారని, సమస్య పరిష్కారానికి కృషి చేసి కురువలను ఆదుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ కురువలకు న్యాయం చేయాలని ఎంపీలు గోరంట్ల మాదవ్ ,  డా.సంజీవ్ కుమార్ గారిని కోరుతున్నామన్నారు. కురువలకు న్యాయం చేసిన పార్టీకి మా కులస్థులు నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.

About Author