PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంఈఓ మస్తాన్ వలి సేవలు మరువలేనివి

1 min read

పత్తికొండ ఎంపీపీ నారాయణదాసు

ఎంఈఓ పదవి విరమణ కార్యక్రమానికి తరలివచ్చిన ఉపాధ్యాయులు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మండల విద్యాధికారి మస్తాన్ వలి సేవలు మరువలేనివని పత్తికొండ ఎంపీపీ నారాయణ దాసు అన్నారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని యశోద గార్డెన్ పాఠశాల ఆవరణలో పత్తికొండ ఎంఈఓ-1 వి.మస్తాన్ వలి పదవి వివరణ కార్యక్రమం  మండల విద్యాధికారి-2 గాజుల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నారాయణ దాసు, సర్పంచ్ కొమ్ము దీపిక, రిటైర్డ్ ఎంఈఓ  కబీర్, పత్తికొండ, ఆస్పరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు వీరేశప్ప, లక్ష్మి నరసింహులు, ఆదోని రిటైర్డ్  డిప్యూటీ డిఇఓ  శివ రాముడు, మద్దికేర ఎంఈఓ గోపాల్,  పత్తికొండ, తుగ్గలి, ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాలతి, జయలక్ష్మి, హనుమంత నాయుడు, జాకీర్, రమేష్ నాయుడు, రిటైర్డ్ హెచ్ఎం వెంకమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఎంఈఓ మస్తాన్ వలి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ  అటు తోటి ఉపాధ్యాయులతోనూ మరియు ఇటు విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేవారని తెలిపారు. మస్తాన్ వలి ఉపాధ్యాయుడు నుంచి ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.  పత్తికొండ ప్రాంతంలో ఎక్కువగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. మస్తాన్ వలి మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని అన్నారు. పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న ఎంఈఓ మస్తాన్ వలిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

About Author