NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన ఎంఈఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పి.మౌలాలి తనిఖీ చేశారు.మధ్యాహ్న భోజన పథకాన్ని భోజనాన్ని ఆయన విద్యార్థులతో పాటుగా భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సరైన భోజనం అందించాలని అన్నారు.విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని,తర్వాత పాఠశాలలో ఒక విద్యార్థిని ఆరోగ్యం బాగా లేనందువలన విషయం తెలుసుకున్న ఎంఈఓ మిడుతూరు సిహెచ్సి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు జింగిల్ సా పాల్గొన్నారు.

About Author