NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ స్కూల్ విద్యార్థుల మేరీ మిట్టి మేరీ దేశ్ ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆజాద్ ఇక అమృత మహోత్సవం మేరీ మిట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ ఉర్దూ స్కూల్ విద్యార్థులుర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మేరీ మిట్టి మేరీ దేశ్ బ్యానర్ తో అమృత మట్టి కలశంలో చేత భూమి జాతీయ నాయకుల చిత్రపటాలతో దేశభక్తి నినాదాలతో జాతీయ పతాకాలతో పాఠశాల నుంచి ఓల్డ్ టౌన్ చౌక్ ,బొంగుల బజార్, మించిన బజార్ ,గడియారం ఆస్పత్రి మీదుగా ర్యాలీ చేపట్టారు.అనంతరం పాఠశాలకు చేరి ప్రాణ ప్రతిజ్ఞ చేశారు .ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పుష్పరాజు మాట్లాడుతూ అమృత కలశ యాత్ర లో ప్రదర్శించిన మేరీ మిట్టి మేరీ దేశ్కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ చేపట్టి పాఠశాలలో సేకరించిన మట్టిని మండల స్థాయి అధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.ఈ ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు అబ్దుల్ సుకూర్,విజయ్ కుమార్ ,తాజుద్దీన్,చక్రపాణి ,షాహిదా బేగం ,ఇబ్రహీంతదితరులు పాల్గొన్నారు.

About Author