NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలిసిన చెలుమోలు అశోక్ గౌడ్

1 min read

జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి ని చేసేంతవరకు బీ.సీ.లంతా ఐక్యంగా కృషి చేయాలి

చెలుమోలు అశోక్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఐక్య బి.సి. సంఘాలు, మరియు గౌడ సంఘాలు పూర్తిగా ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి మద్దతూ గా నిలిచి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా చేసేందుకు అందరూ కృషి చెయ్యాలని రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు చలుమోలు అశోక్ గౌడ్ పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం మాజీ ఉప ముఖ్య మంత్రి, ఏలూరు ఎమ్.ఎల్.ఏ. ఆళ్ల నాని క్యాంప్ కార్యాలయంలో ఆళ్ల నానిని చలుమోలు అశోక్ గౌడ్ మరియు ఆయన అనుచరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా ఆళ్ల నాని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బి.సి.ల పక్ష పాతి అని బి. సి. లకు తగు ప్రాతినిధ్యం కల్పించారని, అందరూ రానున్న ఎన్నికల్లో సమిష్టి కృషితో భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమం లో చల్లచింతలపూడి సర్పంచ్ బయగాని శ్రీమన్నారాయణ,ఉపాధ్యక్షులు బయగాని అంకాల రావు, వేముల రమేష్, ఎల్ సుభాష్, కార్పొరేటర్ బత్తిన విజయకుమార్ తదితరులు ఉన్నారు.

About Author