PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోటార్లకు మీటర్లు రైతులకు ఆమోదమే !

1 min read

పల్లెవెలుగువెబ్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మోటార్లు బిగించే విషయంపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి… సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై 95 శాతం మంది రైతులు అనుకూలంగా ఉన్నారని అన్నారు. అయితే ఈ విషయంపై విపక్ష టీడీపీ… మోటార్లకు మీటర్లతో రైతులకు ఊరితాడేనంటూ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సాగు మోటార్లకు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరాపై రైతుకు హక్కు కల్పించినట్లు అవుతుందన్నారు. 2023 మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఆయన చెప్పారు.

About Author